తిరుమల పాదాల చెంత అలిపిరిలో రూ.750 కోట్ల‌తో 38 ఎక‌రాల్లో దేవ‌లోకం...

మంగళవారం, 18 అక్టోబరు 2016 (16:58 IST)
తిరుమ‌ల‌: అల‌నాడు విశ్వామిత్రుడు త్రిశంకు లోకాన్ని సృష్టించిన‌ట్లు... ఏపీ ప్ర‌భుత్వం దేవ‌లోకం సృష్టించాల‌ని సంక‌ల్పించింది. తిరుమ‌ల‌లోని అలిపిరి వ‌ద్ద ఈ నిర్మాణాన్ని చేప‌ట్ట‌నున్నారు. ఆధ్యాత్మిక‌, సంస్కృతిక‌, వినోదాత్మ‌క దేవ‌లోకాన్ని నిర్మించ‌నున్నారు. దీనికి 750 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతాయ‌ని అంచ‌నా వేశారు.
 
38 ఎక‌రాల‌లో ఈ నిర్మాణాల‌ను చేప‌డుతున్నారు. ఏపీ ప్ర‌భుత్వం దీనిని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా, దేశ విదేశాల వారిని ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దాల‌ని సంక‌ల్పించింది. 2020 నాటికి ఈ దేవ‌లోకం నిర్మాణం పూర్త‌వుతుంద‌ని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి