భ‌క్తుల‌కు అందుబాటులో ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం టికెట్లు

మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (21:13 IST)
తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం టికెట్ల‌ను మంగ‌ళ‌వారం నుండి టిటిడి భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచింది. భ‌క్తుల కోరిక మేర‌కు తిరుమల శ్రీవారి ఆల‌యం త‌ర‌హాలో ఇక్క‌డ ఆన్‌లైన్ విధానంలో క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఆల‌యాల్లో ఏకాంతంగా ఆర్జిత సేవ‌లు నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే.
 
వారంలో సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం టికెట్లు ఆన్‌లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్ ధ‌ర రూ.500/-గా నిర్ణ‌యించారు. గృహ‌స్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్ల‌ను బుక్ చేసుకుని ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా క‌ల్యాణోత్స‌వాన్ని వీక్షించ‌వ‌చ్చు.
 
ఆ త‌రువాత 90 రోజుల్లోపు గృహ‌స్తులు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క్యూలైన్‌లో ఉచితంగా ద‌ర్శించుకునే అవ‌కాశం క‌ల్పించారు. ద‌ర్శ‌నానంత‌రం ఉత్త‌రీయం, ర‌విక‌, అక్షింత‌లు ప్ర‌సాదంగా అందిస్తారు. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భ‌క్తులు ఆన్‌లైన్ క‌ల్యాణోత్స‌వం టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు