సూర్య గ్రహణం.... నేడు శ్రీవారి ఆలయం మూసివేత

మంగళవారం, 8 మార్చి 2016 (07:10 IST)
సూర్యగ్రహణం కావడంతో మంగళవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి బుధవారం ఉదయం 10 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయాల్లో శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తుంటారు. 
 
సూర్యగ్రహణం కావడంతో శ్రీవారి ఆలయంలో సహస్ర కలశాభిషేకాన్ని టిటిడి రద్దు చేసింది. స్వామివారికి సుప్రభాత, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద సముదాయాన్ని కూడా మూసివేయనున్నట్లు టిటిడి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియాకు తెలిపారు. మరోవైపు గ్రహాలకు అతీతుడైన శ్రీకాళహస్తీశ్వరుని ఆలయాన్ని మాత్రం సూర్యగ్రహణం రోజున తెరిచే ఉంచుతారు.

వెబ్దునియా పై చదవండి