అద్భుతం.. అలివేలు మంగమ్మ వరలక్ష్మి వ్రతం(వీడియో)

శుక్రవారం, 4 ఆగస్టు 2017 (18:13 IST)
తిరుమల వెంకన్న పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య వరలక్ష్మి వ్రతాన్ని టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించారు. 
 
వందలాది భక్తుల గోవిందనామ స్మరణలతో ఆస్థాన మండపంలో వ్రతం జరిగింది. ఏడాదికి ఒకసారి వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని టిటిడి ఆధ్వర్యంలో తిరుచానూరు వైభవోపేతంగా టిటిడి నిర్వహిస్తూ వస్తోంది.

వెబ్దునియా పై చదవండి