దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బాంబే స్టాక్ మార్కెట్లలో బుధవారం ముహూరత్ ట్రేడింగ్ జరుగనుంది. కేవలం గంటపాటు సాగే ఈ ట్రేడింగ్లో రికార్డు స్థాయి కొనుగోళ్లు జరుగుతాయి. దీపావళి పర్వదినాన కొనుగోలు చేసే షేర్లు లాభాలను ఆర్జించిపెడతాయన్న నమ్మకం సంప్రదాయ పెట్టుబడిదారుల్లో బలంగా ఉంది. దీంతో ఈ ట్రేడింగ్లో భారీగా పెట్టుబడులు పెట్టి షేర్లు కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు.
ఇందులోభాగంగా, అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించేందుకు బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ)లు ఏర్పాట్లు చేశాయి. బుధవారం సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభంకానున్న మూరత్ ట్రేడింగ్ 6.45 గంటలకు ముగుస్తుంది. ఈ ఏడాది ఏ స్థాయి రికార్డులు నమోదవుతాయన్న ఆసక్తికర చర్చకు మార్కెట్ వర్గాలు అప్పుడే తెరలేపాయి.