11,600 మార్కును దాటిన నిఫ్టీ, 250 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్

బుధవారం, 16 సెప్టెంబరు 2020 (19:46 IST)
ఆటో, ఫార్మా మరియు రియాల్టీ రంగాల నేతృత్వంలోని నేటి ట్రేడింగ్ సెషన్‌లో భారతీయ సూచికలు అధికంగా ముగిసాయి. నిఫ్టీ 0.72% లేదా 82.75 పాయింట్లు పెరిగి 11,604.55 వద్ద ముగియగా, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 0.66% లేదా 258.50 పాయింట్లు పెరిగి 39,302.85 వద్ద ముగిసింది.
 
టాప్ నిఫ్టీ లాభాలలో డాక్టర్ రెడ్డీస్ (4.44%), ఎం అండ్ ఎం (4.01%), హిండాల్కో (3.90%), బజాజ్ ఆటో (3.52%), బ్రిటానియా (3.05%) ఉండగా, ఇండస్ఇండ్ బ్యాంక్ (2.00%), ఎన్‌టిపిసి (1.65) నిఫ్టీ నష్టపోయిన వారిలో భారతి ఇన్‌ఫ్రాటెల్ (1.14%), ఎస్‌బిఐ (1.07%), యాక్సిస్ బ్యాంక్ (1.02%) ఉన్నాయి.
 
నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఆటో, మరియు నిఫ్టీ రియాల్టీ అత్యధిక పనితీరు కనబరిచిన రంగాలలో ఉన్నాయి మరియు 1.5% పైగా లాభపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ ఆకుపచ్చ రంగులో వర్తకం చేసి వరుసగా 0.21% మరియు 0.44% పెరిగాయి.
 
లక్ష్మి విలాస్ బ్యాంక్
క్లిక్స్ గ్రూపులో విలీనం ప్రక్రియ గణనీయంగా పూర్తయిందని బ్యాంక్ నివేదించిన తరువాత లక్ష్మి విలాస్ బ్యాంక్ స్టాక్స్ 9.80% పెరిగి రూ. 22.40 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. తదుపరి దశపై ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్నాయని పేర్కొంది.
 
స్టెర్లైట్ టెక్నాలజీస్
ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి భారతి ఎయిర్‌టెల్‌తో కంపెనీ చేతులు కలిపిన తరువాత స్టెర్లైట్ టెక్నాలజీస్ స్టాక్స్ 3.62% పెరిగి రూ. 162.95 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
వేదాంత లిమిటెడ్.
వేదాంతకు అనుకూలంగా అవార్డును అమలు చేయడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితనప్పటికీ, ఈ షేర్లు 1.86% పెరిగి నేటి ట్రేడింగ్ సెషన్‌లో రూ. 134.00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
పివిఆర్ లిమిటెడ్
గత ఏడాది ఇదే కాలంలో రూ. 887 కోట్ల ఏకీకృత ఆదాయంతో పోల్చితే, జూన్ 20 తో ముగిసిన త్రైమాసంలో పివిఆర్ లిమిటెడ్ షేర్లు 1.32 శాతం క్షీణించి రూ. 1,248.00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ త్రైమాసంలో సంస్థ నివేదించిన పన్ను తర్వాత ఏకీకృత నష్టం రూ. 226 కోట్లు గా ఉంది.
 
భారతి ఎయిర్‌టెల్
10 టెలికాం సర్కిల్‌లలో ఆధునిక ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి టెలికాం మేజర్ స్టెర్లైట్ టెక్నాలజీస్‌తో చేతులు కలిపిన తరువాత భారతి ఎయిర్‌టెల్ స్టాక్స్ ఒక శాతం లాభపడ్డాయి కాని చివరికి 0.82% క్షీణించి రూ. 481.55 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
 
భారతీయ రూపాయి
సానుకూల దేశీయ ఈక్విటీ మార్కెట్ల మధ్య భారత రూపాయి యుఎస్ డాలర్‌తో రూ. 73.52 రూపాయలుగా ముగిసింది.
 
బంగారం
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ధరలు స్వల్పంగా క్షీణించిన మధ్య బంగారం ఎంసిఎక్స్ లో అధికంగా వర్తకం చేసింది. అక్టోబర్ 20 బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.16% పెరిగి రూ. 51,850 కు చేరుకుంది.
 
చమురు
యుఎస్ ఆఫ్షోర్ చమురు మరియు గ్యాస్ ఉత్పత్తికి హరికేన్ అంతరాయం కలిగించిన తరువాత చమురు ధరలు నేటి సెషన్లో పెరిగాయి. బ్లీక్ గ్లోబల్ ఆయిల్ డిమాండ్లు నష్టాలను పూడ్చాయి.
 
మిశ్రమంగా వాణిజ్యం జరిపిన ప్రపంచ మార్కెట్లు
నేటి సెషన్‌లో ప్రపంచ మార్కెట్లు మిశ్రమ పనితీరును కనబరిచాయి. ఫెడరల్ రిజర్వ్ నుండి సహాయక విధానం కోసం పెట్టుబడిదారులు ఆశించడంతో యుఎస్ స్టాక్స్ పెరిగాయి. యూరోపియన్ స్టాక్స్ అయితే ఎరుపు రంగులో వర్తకం చేయబడ్డాయి. నాస్‌డాక్ 1.12%, నిక్కీ 225 0.09% పెరిగాయి. మరోవైపు, ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి ఎఫ్‌టిఎస్‌ఇ 100, మరియు హాంగ్ సెంగ్ వరుసగా 0.47%, 0.18% మరియు 0.03% తగ్గాయి.
 
-అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు