వచ్చే ఏడాది సింగపూర్లో జరుగనున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే 14 మంది సభ్యులుగల జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఏడుగురు పురుషులు, ఏడుగురు మహిళలతో కూడిన ఈ జట్టును 2010లో జరిగే కామన్వెల్త్ పోటీలలో పాల్గొనేందుకుగానూ ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ సెంటర్ అధికార వర్గాలు వెల్లడించాయి.
కాగా.. 14 మందితో కూడిన ఇదే జుడోకాస్ జట్టు వచ్చే సంవత్సరం జైపూర్లో నిర్వహించే రాజీవ్ గాంధీ కాంపిటీషన్లో కూడా పాల్గొంటుందని క్రీడా శాఖాధికారులు పేర్కొన్నారు. అమన్దీప్, నవ్జీత్ చానా, మంజిత్ సింగ్, రామ్షెర్ యాదవ్, వీరేంద్ర సింగ్, యశ్పాల్ సోలంగి, సంజయ్ సింగ్లు జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు. అలాగే మహిళలల్లో రజ్ని, తుంబి దేవి, కల్పన, గరిమ, జీనా, జయ, అనితలు ఉన్నారు.