టెన్నిస్ జట్టును కొన్న ''సింగం'' స్టార్.. అజయ్ దేవగణ్!

శుక్రవారం, 31 అక్టోబరు 2014 (18:12 IST)
''సింగం'' స్టార్ అజయ్ దేవగణ్ కూడా టెన్నిస్ జట్టు కొనేశారు. షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ప్రీతీ జింటా, జుహీచావ్లా బాటలోనే 'సింగం' స్టార్ అజయ్ దేవగణ్ కూడా ఓ జట్టులో వాటాలు సొంతం చేసుకున్నాడు.
 
ఇకపై, అజయ్ చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో ఢిల్లీ డ్రీమ్స్ సహ యజమానిగా వ్యవహరిస్తాడు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీ డ్రీమ్స్ జట్టు లోగోను ఆవిష్కరించారు. అజయ్ దేవగణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయినా, ఓ వీడియో సందేశాన్ని పంపారు. 
 
ఢిల్లీ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తుండడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నాడు. తమ జట్టు ఇతర జట్లకు చుక్కలు చూపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. 

వెబ్దునియా పై చదవండి