ఈ నేపథ్యంలో బ్రిటీష్-ఇరానియన్ మహిళ ఘోంచే ఘవామీ పురుషుల వాలీబాల్ మ్యాచ్కు హాజరవడమే కాక, "మీరు కూడా వాలీబాల్ మ్యాచ్లకు వెళ్ళగలగాలి" అని ఇతర మహిళలకు పిలుపునిచ్చింది. అదే ఆమె చేసిన నేరం! వెంటనే ఇరాన్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రిమాండ్ ఖైదీగా ఆమెను ఇప్పటికే మూడు నెలలకు పైగా జైల్లో ఉంచారు.