ఆద్యంతం ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో నిర్ధేశిత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 3-3 గోల్స్తో సరిసమానంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ను మరికొంతసేపు పొడిగించాల్సి వచ్చింది. అయితే 117వ నిమిషంలో స్కాట్లాండ్ ఆటగాడు స్టీఫెన్ పాల్ పియర్సన్ అద్భుత గోల్ను సాధించి కేరళ బ్లాస్టర్స్ను ఫైనల్కు చేర్చాడు.