ఈ సందర్భంగా 68 కిలోల బెల్లంతో తులాభారం సమర్పించి ఆమె మ్రొక్కును తీర్చుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రియో ఒలంపిక్స్కు ముందు శ్రీవారిని దర్శించుకున్నానని, ఆయన కృప ఉండడంతోనే విజయం సాధించగలిగినట్టు చెప్పారు. రియోలో రాణించి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.