గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ చివరి మ్యాచ్‌లో సానియా మీర్జాకు నిరాశ

శుక్రవారం, 27 జనవరి 2023 (11:09 IST)
హైదరాబాద్ క్రీడాకారిణి, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడగా, అందులో నిరాశఎదురైంది. మెల్‌బోర్న్ వేదికగా ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ టెన్నిస్ టోర్నీ జరుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో సానియా మీర్జా - రోహాన్ బోపన్న జోడీ ఓటమి పాలైంది. 
 
ఫైనల్ మ్యాచ్‌లో 6-7, 2-6 తేడాతో బ్రెజిల్ జంట్ స్టెఫాని - రఫెల్‌లో చేతి ఓడిపోయింది. దీంతో ఓటమితో టెన్నిస్ కెరీర్‌కు సానియా వీడ్కోలు పలికినట్టయింది. 2009లో మహేష్ భూపతితో కలిసి సానియా తన తొలి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత మరో ఐదు డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు సొంతం చేసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు