వింబుల్డన్‌కు బైబై చెప్పేసిన సానియా.. భావోద్వేగ పోస్టు

గురువారం, 7 జులై 2022 (19:08 IST)
Sania Mirza
ప్రతిష్టాత్మక వింబుల్డన్‌కు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బైబై చెప్పేసింది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో ఓటమిపాలైన తర్వాత ఆమె భావోద్వేగంతో స్పందించింది. 
 
20 ఏళ్లు వింబుల్డన్‌లో ఆడటం తనకు దక్కిన గౌరవం అన్న సానియా వ్యాఖ్యలపై వింబుల్డన్ స్పందిస్తూ... 'ఆ గౌరవం మాది సానియా' అని ట్వీట్ చేసింది. 2015 విమెన్స్ డబుల్స్ ఛాంపియన్ ఆల్ ది బెస్ట్ చెపుతున్నట్టు తెలిపింది.
 
ఇంకా సానియా తన భావోద్వేగ పోస్టులో ఏం చెప్పిందంటే.. క్రీడలో గెలుపోటములు గంటల కొద్దీ హార్డ్ వర్క్ చేస్తే వస్తాయని.. ఎంతో పోరాడి ఓడిన తర్వాత నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని చెప్పింది సానియా. కానీ ఇవన్నీ మైదానంలో దిగాక మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకొచ్చింది. 
 
"కన్నీళ్లు, సంతోషం, పోరాటం, సంఘర్షణ... ఇవన్నీ కూడా చివరకు మన కష్టానికి దక్కే ఫలితాలే. వింబుల్డన్ ఒక అద్భుతం. గత 20 ఏళ్లుగా ఇక్కడ ఆడటం ఒక గౌవరం. ఐ మిస్ యూ' అంటూ సోషల్ మీడియాలో సానియా భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు