తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభమైన నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన శుక్రవారం రాత్రి స్వామి వారిని పెద్దశేషవాహనంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.
ఏడు పడగల బంగారు శేషునిపై శ్రీదేవీ, భూదేవి సమేత మలయప్పస్వామి సర్వాలంకార శోభితునిగా పెద్దశేషవాహనంపై ఊరేగిన వైనం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన శుక్రవారం తిరుచ్చి వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది.