సింహవాహనంపై విహరించిన శ్రీవారు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడవరోజైన సోమవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన శ్రీవారిని దేవస్థానంలోని నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

శ్రీవారి సింహవాహన దర్శనాన్ని తిలకించిన పులకితులైయ్యారు. సోమవారం మధ్యాహ్నం రెండుగంటలకు స్నపన తిరుమంజన వేడుక, రాత్రి తొమ్మిది నుంచి 11 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవలు జరుగనున్నాయని తితిదే ప్రకటనలో తెలిపింది. ఈ సింహవాహన ఊరేగింపులో భక్తుల గోవిందనామ స్మరణతో పాటు కోలాట నృత్యాలు, చెక్కభజనలు, పండరి భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

వెబ్దునియా పై చదవండి