కావలసిన పదార్థాలు : గోధుమపిండి... 200 గ్రా. పంచదార... 200 గ్రా. పాలు... అర లీ. నెయ్యి... 200 గ్రా. కిస్మిస్... పది గ్రా. జీడిపప్పు... పది గ్రా. యాలకులు... ఐదు ఎండు ద్రాక్ష... పది గ్రా.
తయారీ విధానం : ఒక బాణలిలో నెయ్యి వేసి గోధుమ పిండిని అందులో వేయించాలి. గోధుమపిండి బాగా బంగారువర్ణంలోకి వచ్చిన తరువాత అందులో వేడి పాలు పోసి ఉడికించాలి. గరిటెతో ఈ మిశ్రమాన్ని కలుపుతూ పాలన్నీ ఇంకిపోయేదాకా ఉడికించాలి. ఈ క్రమంలో అడుగంటకుండా జాగ్రత్తపడాలి. మిశ్రమం గట్టిపడుతున్న సమయంలోనే పంచదారను కూడా వేసి అది పూర్తిగా కరిగేదాకా ఉంచాలి. చివర్లో జీడిపప్పు, యాలకులు, ఎండుద్రాక్షలను పైన చల్లి దించేయాలి. అంతే వీట్ గీ లాప్సీ తయారైనట్లే..!