ఈ పోటీల్లో రోయింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన మంజీద్సింగ్, దేవేందర్ సింగ్, అస్రార్ పాటిల్లతోపాటు ఐదు వెండి పతకాలు, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్న క్రీడాకారులను ఆయన అభినందించారు. జాతీయస్థాయి క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు రాణించటంపట్ల ఆయన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ క్రీడల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రీడాకారులు ఒక బంగారు పతకం, ఒక సిల్వర్ పతకం, నాలుగు కాంస్య పతకాలను మాత్రమే సాధించ గలిగారు.