తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ క్రైస్తవులకు వరాలు కుమ్మరిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఆయన గురువారం ఒక ప్రకటనను వెల్లడించారు. హైదరాబాద్లో క్రైస్తవులు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రూ.10 కోట్ల వ్యయంతో క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. అందుకుగాను స్థలాని కూడా ఈ రోజు ప్రకటిస్తామని తెలిపారు.
అదేవిధగా క్రైస్తవ సోదరుల కోరిక మేరకు జనవరి 1న ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తామని, క్రిస్మస్ పండుగకు రెండురోజుల ప్రభుత్వ సెలవు ప్రకటిస్తున్నామని ఆయన వెల్లడించారు. నగరంలో క్రైస్తవులకు ప్రత్యేక సమాధుల కోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను కేటాయిస్తామని, దానికి ఈ నెలాఖరులో శంకుస్థాపన చేస్తామన్నారు.