కొత్తగా ఏర్పాటు చేసిన 'నీతి ఆయోగ్' తొలి పాలక మండలి సమావేశాలు ఫిబ్రవరి 28వ తేదిన జరగనున్నాయి. ఢిల్లీకి వచ్చి ఈ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్ను మోడీ ఆహ్వానించారు. కాగా ఇదే విధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులను ఆహ్వానిస్తూ మోడీ లేఖలు పంపించారు.