ఫ్రిజ్‌లో బిర్యానీ ప్యాకెట్లు.. ఇప్పుడేమో కేకులో పురుగులు

సెల్వి

శుక్రవారం, 10 ఏప్రియల్ 2026 (11:42 IST)
హైదరాబాదులో ఆహారం కల్తీపై పలు కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఫ్రిజ్‌లో వుంచిన బిర్యానీ ప్యాకెట్లను డెలీవరీ చేసిన ఘటన మరవక ముందే.. మాదాపూర్‌లో కేకులో పురుగులు కనిపించాయి.

మాదాపూర్‌లో ఉన్న బింజ్ అండ్ బాష్ సంస్థను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. ప్రైవేట్ థియేటర్, పుట్టినరోజు వేడుకల కోసం ప్రత్యేక ఆర్డర్లను అందించే ఈ సంస్థ ఇచ్చిన కేకులో పురుగులు వుండటం చూసి కస్టమర్లు షాకయ్యారు. ఆ కేకులో పురుగులు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనికి సంబంధించిన ఒక వీడియోలో, కేకు లోపల పురుగులు కనిపించనప్పటికీ, ఆ కేకులను భద్రపరిచిన రిఫ్రిజిరేటర్ మాత్రం అత్యంత దారుణమైన స్థితిలో ఉంది. అంతేకాకుండా, అక్కడ అందించే ఫ్రోజెన్ డెజర్ట్స్ ఉంచిన రిఫ్రిజిరేటర్ కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు