ఆర్థిక సమస్యల కారణంగా పిల్లలను పెంచేందుకు స్థోమత లేకపోవడంతో కామారెడ్డి పట్టణంలో ఒక వ్యక్తి తన ముగ్గురు కూతుళ్లను సరస్సులో తోసేసి హత్యచేశాడు. శనివారం రాత్రి ఆయత్ (7), మరియం (5) మృతదేహాలను సరస్సు నుండి వెలికి తీయగా, ఆదివారం ఉదయం షిఫాత్ (8) మృతదేహాన్ని వెలికి తీశారు. ఆటోరిక్షా డ్రైవర్ ఇస్మాయిల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఆటోరిక్షా డ్రైవర్ తన కుమార్తెలను తన వాహనంలో అల్పాహారం కోసం ఒక హోటల్కు తీసుకెళ్లి, తరువాత వారిని దింపానని పోలీసులకు చెప్పాడని ఏఎస్పీ చెప్పారు. పిల్లలను ఎక్కడ దింపారో పోలీసులు ప్రశ్నించినప్పుడు, అతని నుంచి పొంతన లేని సమాధానాలు అనుమానాన్ని రేకెత్తించాయి.
దీంతో సీసీటీవీ ఫుటేజ్లు, నిందితుడి ఫోన్ కాల్ రికార్డులను తనిఖీ చేసిన తర్వాత, పోలీసులు అతనిని విచారించారు. ఈ విచారణలో తానే ముగ్గురు కుమార్తెలను హత్య చేశానని నేరం అంగీకరించాడు. ఆపై చెరువ వద్ద ముగ్గురు కుమార్తె మృతదేహాలను వెలికి తీశారు.
ఇకపోతే.. ఇస్మాయిల్ భార్య షబీనా కూలీగా పనిచేస్తుంది. ఆ రోజు కూడా ఆమె కూలీకి వెళ్లింది. ఆర్థిక సమస్యల కారణంగా ముగ్గురు పిల్లలను పెంచడంలో ఇబ్బంది పడుతున్నానని.. అందుకే చంపేశానని ఇస్మాయిల్ పోలీసులతో చెప్పాడని ఏఎస్పీ చెప్పారు. తాను రూ.5 లక్షలకు పైగా అప్పులు తీసుకున్నానని పోలీసులకు చెప్పాడు. తదుపరి విచారణ కోసం అతడిని పోలీసు కస్టడీకి కోరుతామని పోలీసు అధికారి తెలిపారు.