వాస్తు పేరిట ప్రభుత్వ ఆస్తులను ఫణంగా పెట్టడం సరికాదన్నారు. మూఢనమ్మకాలను వదిలి, సైంటిఫికల్గా, లాజికల్గా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ప్రజలు కూడా అనుసరిస్తారని ఆయన హితవు పలికారు. సచివాలయాన్ని మార్చాల్సిన అవసరం ఏంటని అయన నిలదీశారు.
సెక్రటేరియట్ను మార్చాలంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించాలని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించడానికే ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పిన ఆయన, అనవసర పనులు మానేసి సుపరిపాలనపై దృష్టిపెట్టాలని భట్టి విక్రమార్క సలహా ఇచ్చారు.