ఫాస్ట్ పథకంపై హైకోర్టు తాజా వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘ఫాస్ట్’ పథకాన్ని ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత వైఖరికి నిదర్శనమన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును కోర్టులు ఇప్పటికి ఐదుసార్లు తప్పు పట్టాయని లక్ష్మణ్ గుర్తు చేశారు. కోర్టుల్లో ఎదురు దెబ్బలు ఎదురవుతున్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఒంటెత్తు పోకడలను, ఏకపక్ష వైఖరిని మానుకోవడం లేదన్నారు.
స్థానికత అంశంలో కేసీఆర్ భేషజాలు, పట్టింపులకు పోవడం, లేనిపోని రాద్ధాంతం చేయడం మంచిది కాదని లక్ష్మణ్ కేసీఆర్కి హితవు చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో ఏర్పడిన గందరగోళానికి తెరదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.