మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్‌లో ప్రియురాలిని చంపిన ప్రియుడు

శుక్రవారం, 30 జులై 2021 (22:42 IST)
మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్‌లో ప్రియురాలిని చంపాడు ప్రియుడు. మహబూబ్ నగర్‌కు చెందిన సంతోషి, రాములుగా గుర్తించారు మాదాపూర్ పోలీసులు.
 
సంతోషి, రాములు ఇద్దరి వయసు 25 సంవత్సరాలు. ఇద్దరూ బొమ్మరాసిపేట మండల వికారాబాద్ జిల్లా వాస్తవ్యులు. ప్రియురాలిని హోటలుకి తీసుకవచ్చాడు. హైటెక్ సిటీ లెమన్ ట్రీ రూం నెంబర్ 371 తీసుకున్నారు.
 
ఇద్దరి మధ్య ఏం జరిగిందో ప్రియురాలు గొంతు కోసి అతడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు