ఫలితంగా తెలంగాణ ఖాతా నుంచి కేంద్రం లాగేసుకున్న రూ.1,250 కోట్ల నిధులు ఎట్టకేలకు తిరిగి ఆ రాష్ట్రానికి రానున్నాయి. ఈ నిధులను పన్ను చెల్లింపులో జాప్యాన్ని కారణంగా చూపుతూ కేంద్రం ముందస్తు సమాచారం లేకుండానే లాగేసుకున్న విషయం తెల్సిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తారుమారైంది. రెండు నెలల పాటు ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉద్యోగుల వేతనాలు మినహా ఏ ఇతర ఖర్చులకు కూడా నిధులు విడుదల చేయరాదని కూడా ప్రభుత్వం ఆయా శాఖలకు తేల్చిచెప్పింది.