హుస్సేన్సాగర్ బుద్ధ విగ్రహం వద్ద పడవ బోల్తా: టెక్కీ మృతి!
ఆదివారం, 29 మార్చి 2015 (14:59 IST)
హైదరాబాద్లో ఓ టెక్నీ దుర్మరణం పాలైంది. హుస్సేన్సాగర్లో సరదాగా విహారానికి వెళ్లిన ఓ యువతి పడవ బోల్తాపడటంతో మృతి చెందింది. రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. భక్త ప్రవళిక (22) అనే యువతి ముగ్గురు స్నేహితులతో కలిసి మణికొండలో ఓ హాస్టల్లో వుంటుంది. శనివారం రాత్రి స్నేహితులతో కలసి ప్రవళిక హుస్సేన్సాగర్లో సరదాకోసం పడవ షికారు ఏర్పాటు చేసుకుంది.
నాలుగుసార్లు బుద్ధుని విగ్రహం చుట్టూ తిరిగి ఇక ఒడ్డుకు వద్దామనే సమయంలోనే అతివేగంగా నడుస్తున్న పడవ మరో పడవను ఢీకొట్టడంతో ప్రవళిక సాగర్లో పడిపోయింది. దీంతో ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందింది.