ముంబైకి సీఎం కేసీఆర్: ఉద్ధవ్ థాక్రేతో భేటీ

శనివారం, 19 ఫిబ్రవరి 2022 (20:22 IST)
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఇందుకోసం ముంబైకి ప్రయాణం కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.10 నిమిషాలకు సీఎం కేసీఆర్ ముంబై చేరుకోన్నారు. దేష రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. 
 
భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునే ఛాన్సుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ పోరాటానికి తమ మద్దతు వుంటుందని ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముంబైలో సీఎం కేసీఆర్, థాక్రేతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు