కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోడిపుంజు కూతలతో చెవుల్లో దూది..?

శనివారం, 27 ఫిబ్రవరి 2021 (23:23 IST)
ఓ వ్యక్తి మృతి కేసులో కోడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదేంటి అనుకుంటున్నారా.. అయితే చదవండి మరి. కోడి కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని సతీష్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోడిని ఏ1 ముద్దాయిగా చేర్చారు. ఏ1 కోడి రాజాను స్టేషన్‌లో కట్టేశారు. కాసేపు సెల్‌లో, మరికేసేపు చెట్టుకిందకు మార్చేస్తున్నారు. ఇక స్వేచ్ఛను కోల్పోయిన కోడిపుంజు.. తన కూతలతో పోలీస్ స్టేషన్‌ను హోరెత్తిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా, వెలగటూరు మండలం, కొండపూర్‌కు చెందిన తనుగుల సతీష్ అనే యువకుడు పందెంకోడి కాలికి అమర్చిన కత్తి గుచ్చుకుని మృతిచెందాడు. తొత్తునూరులో తన స్నేహితులతో కలిసి కోడిపందేలు నిర్వహించాడు. 
 
కోడిని పందెంలో దించే సమయంలో కత్తికట్టిన కాలు కాకుండా మరో కాలిని పట్టుకున్నాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన కోడిపుంజును సతీష్ గట్టిగా పట్టుకోవడంతో కాలికి అమర్చిన కత్తి సతీష్ పొట్టలో గుచ్చుకుంది. దీంతో బాధితుడిని జిగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండడంతో మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ కేసులో కోడిని త్వరలో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అప్పటి వరకు కోడిని కంటికిరెప్పలా చూసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు