ముగ్గురు పిల్లల్ని ఉరి వేసి చంపుకున్న తల్లి... ఆత్మహత్యాయత్నం

మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (22:53 IST)
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గంగధారపల్లిలో ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను ఉరి వేసి చంపి ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కడుపున పుట్టిన పిల్లలను ఉరేసి చంపిన ఆ తల్లి చేసిన ఘాతుకం అక్కడ సంచలనం సృష్టించింది. 
 
పిల్లలను చంపిన ఆమె కూడా ఆత్మహత్య చేసుకోబోతుండగా తల్లిని స్థానికులు కాపాడారు. చెన్నమ్మ(5), కుమార్(3), రాణి(2) అనే తన ముగ్గురు పిల్లలకు ఆ తల్లి ఉరివేసి చంపి తాను కూడా చనిపోవాలని చెరువులో దూకింది. స్థానికులు గమనించి ఆమెని కాపాడారు. పిల్లలు ముగ్గురూ మరణించారు. కుటుంబ కలహాల వల్లే ఆ మహిళ ఈ దారుణానికి ఒడిగట్టిందని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి