రూ.300కే డయాలసిస్ .. ఎక్కడ?

మంగళవారం, 9 నవంబరు 2021 (10:35 IST)
సాధారణంగా కిడ్నీ రోగులకు చేసే డయాలసిస్ చికిత్సకు వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ముఖ్యంగా, ప్రైవేట్ ఆస్పత్రిల్లో ఈ వైద్యానికి భారీగా వసూలు చేస్తుంటారు. ఈ మొత్తాన్ని పేదలు భరించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంతోమంది అభాగ్యులను భగవాన్‌ మహావీర్‌ జైన్‌ రిలీఫ్‌ ఫౌండేషన్‌ ట్రస్టు(బీఎంజేఆర్‌ఎఫ్‌టీ) ఆదుకుంటోంది. 
 
రూ.వేలు అయ్యే డయాలసిస్‌ను రూ.300కే అందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతోంది. సోమవారం కింగ్‌కోఠి ఆసుపత్రిలోని సెంటర్‌లో ట్రస్టీలతో కలిసి ఆ ట్రస్టు ఛైర్మన్‌ పి.సి.పరాక్‌ మీడియాతో మాట్లాడారు. 
 
కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో 24 డయాలసిస్‌ యంత్రాలతో కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల డయాలసిస్‌లు పూర్తి చేసిన సందర్భంగా ఈనెల 13న సికింద్రాబాద్‌ ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు