భర్తను కోల్పోయిన అందమైన అమ్మాయిలను ఎరవేసే నయీమ్

బుధవారం, 10 ఆగస్టు 2016 (19:09 IST)
గ్యాంగ్‌స్టర్ నయీమ్ దుర్మార్గాలకు సంబంధించిన కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. టార్గెట్ చేసిన వాళ్లకు ముందుగా అందమైన అమ్మాయిలను ఎరగా వేసి, వారు ట్రాప్‌లో పడేట్టు చేయడంలోనూ నయీమ్ సిద్ధహస్తుడని తెలుస్తోంది. అందులో ఆ పని చేసేందుకు స్వయంగా ఎంపిక చేసుకున్న వారిని వినియోగించాడని పోలీసులు తెలుసుకున్నారు. సెటిల్మెంట్లు జరిపేందుకు వెళ్లాల్సి వస్తే, తనతో పాటు మహిళలను, అమ్మాయిలను వాహనంలో వెంటబెట్టుకుని వెళ్తాడని.. అలా చేస్తే పోలీసులు అంత సులువుగా అనుమానించరన్నది నయీమ్ ఉద్దేశం. 
 
ఇదే సమయంలో సోదాలు చేయాలనుకున్నా ఆడవాళ్లు ఉండటంతో.. పైపైనే చూసి పంపేస్తారని నమ్మే నయీమ్, చుట్టూ ఆడవాళ్లను పెట్టుకుని తిరుగుతూ ఉంటాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అందంగా ఉండి చిన్న వయసులో భర్తను కోల్పోయిన వారు.. అనాధలైన వారికి ఆశ్రయం పేరిట లోబరచుకుని వారిని వాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు. 
 
నయీమ్ హత్య తరువాత అరెస్టైన ఇద్దరు అమ్మాయిలు కూడా వంటవారు కాదని, అల్కాపురి ఇంట్లో ఎన్నడూ వంట చేసిన దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు. హోటళ్ల నుంచి తెచ్చుకుని తినే వారని.. వంట మనిషిగా చెబుతున్న ఫర్హానాను సెక్యూరిటీగా మాత్రమే వాడుకున్నారని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి