ట్యాంక్ బండ్‌పై ఆ వేళల్లో సందర్శకులకు మాత్రమే అనుమతి

సోమవారం, 30 ఆగస్టు 2021 (09:45 IST)
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై సాయంత్రం వేళల్లో గడిపేందుకు ఇష్టపడనివారుండరు. కానీ ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో అక్కడ నిముషం కూడా ఆగే పరిస్థితిలేదు.

దీంతో ప్రభుత్వం ప్రత్యేకచర్యలు చేపట్టింది. ఇక నుంచి ప్రతీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సరికొత్త ఆంక్షలు విధించింది.

ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటకులకు అనుకూలంగా ట్యాంక్ బండ్‌ను ఆధునీకరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు