ప్రేమించిన అమ్మాయి వదినగా వచ్చింది, చివరకు ఏం చేశాడంటే..?

మంగళవారం, 21 జులై 2020 (12:51 IST)
అది హైదరాబాద్ లోని మెహిదీపట్నం ఏరియా. చాందిని, రాకేష్‌లు ఇద్దరూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. కరోనా ఎఫెక్ట్‌తో సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మూతపడటంతో ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఇద్దరు కలిసి పనిచేసే సమయంలో ప్రేమించుకున్నారు. అయితే ఆ ప్రేమ కాస్త లాక్‌డౌన్‌తో బాగా దూరమైంది. 
 
కానీ చాందీనీకి పెళ్ళి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. పెళ్ళిళ్ళ పేరయ్య సాయంతో ఉప్పల్ లోని మహేష్ అనే యువకుడిని చూశారు. పెళ్ళి చూపులకు మహేష్‌తో పాటు అతని తల్లిదండ్రులు వచ్చారు. ఐతే మహేష్ సోదరుడు రాకేష్ తన సోదరుడు చూసిన అమ్మాయి తను ప్రేమించి అమ్మాయి అని తెలియదు. మరోవైపు కరోనా కావడంతో త్వరగా పెళ్ళి చేసేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
ముహూర్తం పెట్టేసుకున్నారు. వివాహానికి పత్రికలు లేకపోవడం.. బంధువులను ఫోన్ల ద్వారా పరిమిత సంఖ్యలోనే పిలిచారు. అయితే అన్న పెళ్ళి గురించి ఏమాత్రం పట్టించుకోని రాకేష్ సరిగ్గా వివాహం సమయానికి వచ్చాడు. పెళ్ళి కూతురు చాందినిని చూసి షాకయ్యాడు. తట్టుకోలేకపోయాడు.
 
ఇంకేముంది. ఇంటికి వెళ్ళడం మానేశాడు. తాగుడుకు బానిసయ్యాడు. పెళ్ళయిన 10 రోజుల తరువాత ఇంటికి వెళ్ళాడు. రాకేష్ పరిస్థితి చూసి చాందినీ చలించిపోయింది. తనను ఎలాగైనా మామూలు స్థితికి తీసుకురావాలనుకుంది. అతడిని యధాస్థితికి తెచ్చే క్రమంలో అతడికి దగ్గరై అతనితో శృంగారం చేయడం ప్రారంభించింది. 
 
భర్త ప్రొవిజన్స్ స్టోర్ నడిపేవాడు. ఉదయం వెళితే రాత్రి వరకు ఇంటికి రాడు. దీంతో ఆమె రాకేష్‌తో పూర్తిగా లీలలు సాగించింది. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు బాగా వృద్ధులు కావడంతో వారు ఎప్పుడూ ఇంటి బయటే కూర్చుని ఉండటం.. చాందినీ, రాకేష్‌లు ఇంట్లో ఏం చేస్తున్నారన్నది పట్టించుకోవడం మానేశారు. అయితే విషయం కాస్తా భర్తకు తెలిసింది. సరిగ్గా రెండురోజుల క్రితం వీరి బండారం బయటపడింది. ఇద్దరిని చితకబాది ఇంటి నుంచి గెంటేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు