ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యను అలా చేసి పారిపోయిన భర్త

బుధవారం, 13 అక్టోబరు 2021 (13:14 IST)
ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం కాపురం కూడా చేశాడు. ఇంతలో ఏమైందోగానీ, భార్య చేతిని కత్తిరించి పారిపోయాడో భర్త. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైలో నివసించే హసి (22), జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరికి చెందిన రవి నాయక్‌‌ల మధ్య ఫేస్‌బుక్‌ పరిచయం ఏర్పరచింది. రవి నాయక్‌ ఇటీవల ఆమెను పెళ్లి చేసుకొని నగరానికి తీసుకొచ్చాడు. హసి బ్యూటీషియన్‌గా పని చేస్తుండగా రవినాయక్‌ ఖాళీగా ఉన్నాడు. 
 
ఈ నెల 10వ తేదీన తనకు రూ.50 వేలు కావాలంటూ రవి నాయక్‌ భార్యను అడిగాడు. అందుకు ఆమె తన వద్ద లేదని చెప్పింది. అంతే ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన భర్త.. భార్యను తీవ్రంగా కొట్టి కత్తితో ఓ వేలిని కట్‌ చేసి పారిపోయాడు. 
 
మరోసటి రోజు ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రవి నాయక్‌పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రవి నాయక్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు