పెళ్లి చేసుకుని తొలిరాత్రి భార్యతో గడిపాడు... నువ్వు నాకొద్దంటూ విడాకులు... ఏం జరిగింది?

శనివారం, 1 ఏప్రియల్ 2017 (16:48 IST)
పెళ్లిళ్లు పెటాకులవుతున్న సందర్భాలు ఈమధ్య ఎక్కువగా కనబడుతున్నాయి. విడాకులు తీసుకోవడం అనేది చాలా సింపుల్‌గా మారిపోయింది. సహజీవనం, రెండో పెళ్లి తదితర వ్యవహారాలు ఇప్పుడు మామూలుగా మారిపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే... తన మొదటి భార్యను ఒప్పించి మరో మహిళను వివాహం చేసుకున్న ఓ పురుషుడు, రెండో భార్యతో ఒకే ఒక్కరోజు గడిపి ఇక ఆమె తనకు అక్కర్లేదనుకున్నాడు. పోస్టులో విడాకులు పత్రం పంపించి, తను విడిపోవాలనుకుంటున్నట్లు తెలిపాడు.
 
వివరాల్లోకి వెళితే... హైద‌రాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రకాశం పంతులు నగర్‌ ప్రాంతంలో 38 ఏళ్ల మహ్మద్ హనీఫ్, 32 ఏళ్ల బహదురున్నీసా దంపతులున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కానీ హనీఫ్ కు మాత్రం అబ్బాయి కావాలని గోల చేయడం మొదలుపెట్టాడు. మరోవైపు భార్య గర్భస్రావం కావడంతో ఇక ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. దీనితో అతడు ఓ నిర్ణయానికి వచ్చాడు. మరో యువతిని రెండో పెళ్లి చేసుకుని ఆమె ద్వారా అబ్బాయిని కంటానని భార్యను ఒప్పించాడు. ఆమె ఒప్పుకోగానే తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన ఫర్హీన్‌ను పెళ్లాడాడు. ఆమెను పెళ్లాడేటపుడు మొదటి భార్య నుంచి విడాకులు తీసుకుంటానని వారికి చెప్పాడు. 
 
అలా పెళ్లాడిన రెండో భార్యను తెచ్చి కూకట్ పల్లిలో పెట్టి ఆమెతో తొలిరాత్రి గడిపాడు. తెల్లారేసరికి పత్తా లేకుండా పోయాడు. కొన్ని గంటల తర్వాత రెండో భార్యకు ఫోన్ చేసి, తనకు ఆరోగ్యం సరిగా లేదనీ, ఆసుపత్రిలో చేరాననీ చెప్పి నువ్వు మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లమని చెప్పాడు. ఆ తర్వాత పోస్టులో ఆమెకు విడాకుల పత్రాలను పంపాడు. వాటిని చూసిన ఫర్హీన్ షాకయింది. దీనితో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి