తెరాస ఆగడాలకు చెక్ పెడతా - తెలంగాణాలో పాదయాత్ర

బుధవారం, 4 మే 2022 (10:58 IST)
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవమత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌పై దాడి జరిగింది. ఆ రాష్ట్రంలోని అధికార తెరాసకు చెందిన పార్టీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయి. దీనిపై కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. తెరాస ఆగడాలను మరెంతోకాలం సాగనివ్వబోనని జోస్యం చెప్పారు. 
 
తనపై జరిగిన దాడి గురించి ఆయన మాట్లాడుతూ, తెరాస ఆగడాలను ఇక సాగనివ్వబోనని, త్వరలోనే రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. తాను మళ్లీ సిరిసిల్లకు వెళ్తానని, ఈసారి అరెస్ట్ చేస్తారా? చంపుతారా? అని ప్రశ్నించారు. ఇటీవల తనపై జరిగిన దాడిని డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమారే చేయించారని పాల్ ఆరోపించారు.
 
మరోవైపు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామ రైతులు మంగళవారం పాల్‌ను హైదరాబాద్‌లో కలిశారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు పరిహారంగా ఇవ్వాలని, అది కూడా ఐదు రోజుల్లో అందించాలని ప్రభుత్వాన్ని పాల్ డిమాండ్ చేశారు. లేదంటే ఆ పరిహారమేదో తానే అందిస్తానని, అందుకు అనుమతి ఇవ్వాలని పాల్ ప్రభుత్వాన్ని కోరినట్టు రైతులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు