తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గేటుపల్లి తండాకు చెందిన దర్యావత్ సింగ్ (42) హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసలపల్లికి చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉంది.
ప్రియురాలి నుంచి ఫోన్ వచ్చిన మరుక్షణమే ఇంట్లో వాలిపోయిన సాంబరాజు.. జ్యోతితో కలిసి దర్యావత్ గొంతు బిగించి హత్యచేశారు. అనంతరం వెంట తెచ్చిన ట్రాలీ ఆటోలో మృతదేహాన్ని పత్తి చేనులోకి తరలించి, అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే, మరుసటి రోజు వెళ్లి చూడగా మృతదేహం సగమే కాలింది. దీంతో మృతదేహాన్ని పూర్తిగా కాల్చేసి బూడిదను తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు.
ఈ క్రమంలో తన తమ్ముడు దర్యావత్ కనిపించకపోవడంతో అన్న వీర్రాజు 21వ తేదీన నెక్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జ్యోతి తీరుపై అనుమానంతో ఆమె కాల్డేటాను సేకరించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు అంగీకరించడంతో ఇద్దరినీ అరెస్టు చేశారు.