భర్తను పప్పుకాడతో కొట్టి చంపేసింది.. తర్వాత అలా డ్రామా చేసింది..

మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (15:02 IST)
ప్రియుడి కోసం భర్తను చంపేసింది. చివరికి ఆత్మహత్యలా చిత్రీకరించింది. అసలు విషయం బయటపడటంతో చిక్కుల్లో పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. భర్త హత్యకు పప్పు కాడనే ఆయుధంగా మార్చుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం, కళ్యాణదుర్గం మండలం దొడ్డి కుంట గ్రామంలో ఉండే శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తికి 9 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 7 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఇక అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో భార్య అదే ప్రాంతానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం నెరపింది. ఇక ఈ విషయం భర్త వరకు వెళ్లడంతో తీరు మార్చుకోవాలి అంటూ భార్యను పలుమార్లు హెచ్చరించాడు. 
 
ఈ విషయంపై భార్యాభర్తలు ఇద్దరూ ఈ మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక భార్య ప్రవర్తనతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాస్ చౌదరి మద్యానికి బానిసగా మారిపోయాడు. నిత్యం మద్యం మత్తులో వచ్చి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇటీవల ఇలాగే మద్యం తాగి వచ్చి భార్యతో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో గొడవ పెద్దది అయ్యింది. 
 
ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న భర్త శ్రీనివాస్‌ను భార్య పక్కనే ఉన్న పప్పు కాడతో తలపై దారుణంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక భర్త ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితురాలిని అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు