తల్లి పొత్తిళ్లలో నుండి శిశువును ఎత్తుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో చోటుచేసుకుంది. కరీంనగర్ మండలం కొత్తపల్లికి చెందిన స్రవంతి గత నాలుగు రోజులుగా జగిత్యాల లోని జయ నర్సింగ్ హోంలో పొత్తికడుపులో గుడ్డలు కుక్కుకుని తిరుగుతూ గర్భవతిగా అందరిని నమ్మించింది.
అయితే కొద్దిసేపటికే బాబు తన పక్కలో లేడని గమనించిన సంధ్య తన బంధువులకు సమాచారం అందించింది... దీంతో పట్టణంలో వెతకగా పాత బస్డాండ్ సమీపంలో స్రవంతి కనిపించడంతో ఆమె వద్ద నుంచి బాబును తీసుకుని ఆమెను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే మూడేళ్ల కొడుకును కలిగి ఉన్న స్రవంతి బాబును అమ్మేందుకే అపహరించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.