తెలంగాణ సీఎం కేసీఆర్కు దేవుళ్ల మొక్కుల పట్టింపులు ఎక్కువ. తెలంగాణ సీఎం అయ్యాక.. రాష్ట్రం కావాలన్న తన మొక్కులను సర్కారు సొమ్ముతో తీర్చుకోవడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే తన మొక్కులన్నీ తీర్చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు తన భార్య మొక్కులపై దృష్టి సారించారు. ఆయన తన సతీమణి శోభ మొక్కును త్వరలోనే తీరుస్తానని స్వయంగా తెలిపారు. అది కూడా ప్రభుత్వ ఖర్చుతో కాకుండా తన సొంత ఖర్చుతో తీరుస్తారని క్లారిటీ ఇచ్చారు.