ఇక నీతో ఉండలేను.. భర్త పిల్లలే నాకు ముఖ్యం.. ప్రియుడికి చెప్పిన వివాహిత.. సూసైడ్

శుక్రవారం, 24 జూన్ 2016 (09:20 IST)
ఓ వివాహిత తన ప్రియుడికి దూరంకావాలని నిర్ణయించుకుంది. దీంతో ఆ యువకుడు ప్రియురాలి ఎడబాటును భరించలేనని భావించి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఆత్మహత్య. ఈ వివరాలను పరిశీలిస్తే..మెదక్ జిల్లా పరిధిలోని కోటిపల్లి-చినపులివర్రు రహదారి మధ్యనున్న డొంకలో భట్టిప్రోలు మండలం వెల్లటూరు కొత్తకాలనీకి చెందిన పొట్లూరి ప్రభుదాసు (23) బుధవారం రాత్రి పురుగుల మందు తాగడంతో రాటు తుమ్మ చెట్టుకు ఉరేసుకున్నాడు. 
 
ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ అద్దంకి వెంకటేశ్వర్లు యువకుడు వివరాలను సేకరించి తల్లిదండ్రులను విచారించారు. విచారణలో ప్రభుదాసుకు ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉందని తేలింది. 
 
కానీ ఆ వివాహిత ప్రభుదాసును పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుదాసు బెంగళూరులో అక్కబావల దగ్గరకు వెళ్లి నివాసం ఉండటంతో,  ఐదు రోజుల క్రితం తన పిల్లలను హాస్టల్‌ చేర్పించే విషయం మాట్లాడి వస్తానని చెప్పి ఆ వివాహిత బెంగళూరు వెళ్లింది. అక్కడ ప్రభుదాసును కలిసిన ఆ మహిళ, ఇకపై తన భర్త, పిల్లలతో ఉంటానని చెప్పడంతో మనస్తాపం చెందిన యువకుడు సమీపంలోని కోటిపల్లి - చినపులివర్రు డొంక మార్గంలో పురుగుల మందు సేవించడంతో పాటు ఉరి వేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి