ప్రేమికుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటానన్నాడు.. అంతే ఆ యువతి?

బుధవారం, 29 సెప్టెంబరు 2021 (15:53 IST)
ప్రేమించిన యువకుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని అంకాపూర్‌కు చెందిన మర్సుకోలు గంగుబాయి (18) జైనథ్ మండలం జామ్నికి చెందిన పెందూర్‌ రవీందర్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
 
ఈ క్రమంలోనే రవీందర్, తాను వేరే యువతిని పెళ్లి చేసుకుంటానని గంగుబాయికి చెప్పాడు. ప్రియుడి మాటకు మనస్తాపం చెందిన గంగుబాయి ఈ నెల 24న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. 
 
గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది గంగుబాయి. తల్లి శోభాబాయి ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు