వికారాబాద్‌లో మహిళ కిడ్నాప్... మాజీ భర్తపై అనుమానం?

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (09:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌లో మహిళ కిడ్నాప్‌కు గురైంది. మరో మహిళతో కలిసి రోడ్డుపై నడిచి వెళుతుండగా కొందరు దుండగులు వచ్చిన ఈ మహిళను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. 
 
ఈ కిడ్నాప్‌పై స్థానిక పోలీసులకు సమాచారం అదించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ప్రత్యేక టీమ్‌లు కిడ్నాపైన మహిళ కోసం వెతుకులాట ప్రారంభించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, దీపిక అనే మహిళ మరో మహిళతో కలిసి రోడ్డుపై నడుస్తూ వెళుతుండగా, గుర్తు తెలియని దుండగులు కొందరు దీపికను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ యువతి గత నాలుగేళ్ళ క్రితం అఖిల్ అనే యువకుడిని ప్రేమ పెళ్ళి చేసుకుంది. ఆ తర్వాత అతనికి దూరమైంది. సో.. అతనే కిడ్నాప్ చేసివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కాగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అందుబాటులో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ నీ పరిశీలిస్తున్నారు. దుండగులు అనంతగిరి వైపు వెళ్లి ఉంటారని భావించి, ఆ వైపు రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు