భర్తకు ప్రాణగండం అంటూ వివాహిత మెడలో తాళి కట్టిన నకిలీ జ్యోతిష్యుడు

గురువారం, 24 సెప్టెంబరు 2020 (12:34 IST)
మూఢ నమ్మకాలను, అంధ విశ్వాసాలను ఆసరాగా చేసుకుని నకిలీ జ్యోతిష్యులు, స్వామిజీలు ప్రజల జీవితాలతో ఆడలాడుకుంటున్న వైనం మనం చూస్తున్నాం. తాజాగా ఇటువంటి ఘటన హైదరాబాద్ కె.పి.హెచ్.బిలో జరిగింది.
 
కోసూరి మాధవ్ అనే వ్య‌క్తి తాను జ్యోతిష్యుడిని అంటూ ఓ వివాహితకు పరిచయమయ్యాడు. జాతకంలో దోషం ఉంద‌ని, దాని వ‌ల్ల ఆమెకు పక్షవాతం, భర్తకు ప్రాణపాయం ఉందని నమ్మించాడు. దోషనివారణకు పూజలు చేస్తే  సరిపోతుందని నమ్మించాడు. పూజా సమయంలో భర్త ఉండకూడదు అని మాయమాటలు చెప్పి పూజ పేరుతో ఆ వివాహిత మెడలో తాళి కట్టాడు.
 
తాళి కట్టాక నువ్వు నా భార్యవంటూ డబ్బుల కోసం బెదిరించి, అసభ్యకరమైన ఫోటోలు మెసేజ్ బాధితురాలి ఫోన్‌కి పంపించాడు. దీంతో బాధితురాలు కె.పి.హెచ్.బి. పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ నకిలీ జ్యోతిష్యుడు నుంచి రక్షించాలంటూ వేడుకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కోసూరి మాధవ్‌ను, అతడి స్నేహితుడు రాఘవ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు