ఢిల్లీ లిక్కర్ స్కామ్‌: సీబీఐ నోటీసులు అందాయి.. కవిత

శనివారం, 3 డిశెంబరు 2022 (11:31 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై కవిత స్పందించారు. తనకు సీబీఐ నోటీసులు అందాయని.. విచారణకు సహకరిస్తానని చెప్పారు. 
 
వారి అభ్యర్థన మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో తనను ప్రశ్నించాలని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చానని తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు