'కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో' అనే నినాదాన్ని సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చాడని మనకు తెలుసు. ఆ సంగతి పక్కనపెడితే హైదరాబాద్కి చెందిన ఓ రచయిత 'పవన్ కళ్యాణ్ హఠావో - పాలిటిక్స్ బచావో' అనే పుస్తకాన్ని రాసి విక్రయించబోతున్నాడు.
ఈ పుస్తకాన్ని బుధవారం నుంచి జనవరి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకం కూడా పెడుతున్నారట. దీనిపై ఆయనకు సందేహం వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ప్రమాదం ఉందని, కనుక తనకు రక్షణ కల్పించాలని ఆయన హోమ్ మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.