కోటి ఆశలతో మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొండిచేయి చూపినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు రంగంలోకి దిగారు.
ఈ విషయాన్ని జగ్గారెడ్డికి పవన్ స్వయంగా ఎస్ఎంఎస్ ద్వారా వెల్లడించినట్టు సమాచారం. దీంతో చంద్రబాబు, వెంకయ్య నాయుడులు రంగంలోకి దిగారు. వీరిద్దరు పవన్తో సంప్రదింపులు జరపడమే కాకుండా, స్వయంగా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించారు. అంతేకాకుడా, జగ్గారెడ్డికి మద్దతుగా బీజేపీ జాతీయ అధినేత అమిత్ షా, కేంద్ర మంత్రులను రంగంలోకి దించనున్నారు.