మొత్తం 20 మంది విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో 13 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. ఏడుగురు చిన్నారులకు వెంటిలేటర్ల ద్వారా చికిత్సనందిస్తున్నారు. మరో ఏడుగురి పరిస్థితి నిలకడగా వుంది. ఈ ఉదయం తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య విద్యార్థుల తల్లిదండ్రుల్ని పరామర్శించారు