చీర కట్టుకునివున్న ఫోటోలను పంపాలని వేధిస్తున్నాడు...

ఆదివారం, 30 జులై 2023 (17:18 IST)
తెలంగాణ సీఐడీ డీఎస్పీ కిషన్‌ సింగ్‌పై కేసు నమోదైంది. కిషన్ సింగ్‌ తనను వేధిస్తున్నారంటూ టీఎస్ ఎస్‌పీడీసీఎల్ మహిళా ఉద్యోగిని ఒకరు హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కిషన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
ఆమె చేసిన ఫిర్యాదులో కిషన్ సింగ్ అసభ్యకర మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు నా ఫోన్‌కు పంపిస్తున్నారు. చీర కట్టుకుని ఉన్న ఫోటోలు పంపాలంటూ వేధిస్తున్నారు. ఆ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. రెండేళ్ల క్రితం సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో కిషన్ సింగ్‌ పరిచయమైనట్టు ఆ మహిళ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు