కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం

శనివారం, 16 జులై 2022 (20:30 IST)
తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు ప‌లు గ్రామాల్లో భారీగా నీరు నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏటూరునాగారంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్ర‌జ‌ల‌కు సాయం చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వెళ్ళారు. 
 
ఆ స‌మ‌యంలో ఎలిశెట్టిపల్లి వాగు వ‌ద్ద‌ ఆమె ప్రయాణిస్తున్న పడవ ఒక్క‌సారిగా చెట్టుకు ఢీకొంది. ఆ వెంట‌నే వాగు ప్ర‌వాహానికి ఆ పడవ ఒడ్డుకు కొట్టుకుపోయింది. ప‌డ‌వ‌లో ఉన్న సీతక్క ఎట్ట‌కేల‌కు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. 
 
అనంతరం ఆమె తన పర్యటనను కొనసాగించారు. కాగా, ప‌లువురు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు సీత‌క్క‌ నిత్యావసరాలు పంపిణీ చేశారు. 

Lucky that our boat got dashed to this tree and got out of boat safely, after distributing groceries to flood victims on the way back on boat we ran out of fuel and by the force of water our boat travelled some distance and dashed to tree. @RahulGandhi @manickamtagore #rains pic.twitter.com/qT0Zt6xZJk

— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) July 16, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు